Wednesday, February 10, 2010

మెదక్ చర్చ్


మెదక్ చర్చ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో నిర్మించబడిన అద్బుతమైన దేవాలయం. ఇది ప్రస్తుతం దక్షిణ ఇండియా సంఘము ఆధ్వర్యములో నిర్వహించబడుతున్నది. సుమారు ఐదు వేల మంది ఒకేసారి ఆరాధించుకునే అవకాశం ఈ దేవాలయంలో ఉండటం గొప్ప విశేషం. ఇది ' పనికి ఆహార పధకం ' క్రింద నిర్మించబడినదని మీకు తెలుసా? రెండవ ప్రపంచ యుద్ద కాలంలో కరువు సంభవించినపుడు అప్పటి మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్, చర్చ్ నిర్మాణం తలపెట్టి, ఈ నిర్మాణంలో పాలు పొందిన గ్రామస్తులకు ఆహారాన్ని ఇవ్వటం ద్వారా నిర్మాణాన్ని పూర్తి చేయటం జరిగినది. ఆసియా లోనే అతి పెద్దదైన ఈ దేవాలయం 1914 నుండి 1924 నుండి కొనసాగింది. ఈ దేవాలయం వస్తు శిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్. ఈ దేవాలయాన్ని దర్శించు కోవాలనుకునే వారు హైదరాబాద్ జూబిలీ బస్సు స్టాండ్ నుండి లేదా బాలానగర్ చౌరస్తా నుండి వెళ్ళవచ్చు.

No comments:

Post a Comment