
మోకరించి ప్రార్దించు క్రైస్తవుడు అనే ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని పొంది అనేకమైన భాషలలోనికి అనువదించబడి విశేషమైన జనంగానికి మార్గోపదేసంగా ఉంది. ఈ పుస్తకం ఒక అజ్ఞాత క్రైస్తవుని చే వ్రాయబడినదని మీకు తెలుసా ? 1930 వ ప్రాంతములో మొదట ఇంగ్లాండ్ లోను తదుపరి అమెరికా లోను ముద్రించబడిన ఈ పుస్తకం రాను రాను అనేకమైన భాషలలోనికి అనువదింపబడినట్లే తెలుగులో 1994 ప్రాంతములో రచయిత వై. కనక రత్నం గారి ద్వార అనువదింపబడి తెలుగు క్రైస్తవ లోకానికి కూడా ఒక మార్గదర్సకముగా నిలువబడినది. ఈ గ్రంధం కోట్లాది ప్రజల ప్రార్దన జీవితాల్ని ప్రభావితం చేసింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. జీవన్ జ్యోతి ప్రెస్ & పబ్లిషర్స్ వారిచే ముద్రించబడిన ఈ పుస్తకం మీరును పొంది ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందగలరని మా ఆకాంక్ష.
No comments:
Post a Comment